నదిలో పడి వ్యక్తి గల్లంతు

22 Jun, 2015 09:24 IST|Sakshi

శ్రీకాకుళం: ప్రమాదవశాత్తు నదిలోపడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని మహేంద్రతనయ నది కాలి వంతెన పై నుంచి జారిపడ్డాడు. బాధితుడి ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(పాతపట్నం)
 

మరిన్ని వార్తలు