బనగానపల్లిలో వ్యక్తి దారుణ హత్య

27 Apr, 2015 13:28 IST|Sakshi

కర్నూలు : కర్నూలు జిల్లా బనగానపల్లె మండల శివారులోని ఓ తోటలో సాంబయ్యశెట్టి(50) అనే వ్యక్తి ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుడు అనంతపురం జిల్లావాసిగా గుర్తించారు. తోటలో మద్యం సేవించిన అనంతరం ఘర్షణపడి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
(బనగానపల్లె)

మరిన్ని వార్తలు