హైదరాబాద్ : మూసీ నదిలో గల్లంతు అయిన మాన్వి మృతదేహం లభించింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం మర్రిపల్లి వంతెన వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మాన్వి మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. చిన్నారి విగతజీవిగా లభ్యం కావటంతో మేఘశ్యామ్ రెడ్డి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
లండన్కు చెందిన వైద్యుడు మేఘశ్యామ్ రెడ్డి కుమారుడికి మూసీ గురించి వివరిస్తుండగా తండ్రి భుజంపై ఉన్న మాన్వి ప్రమాదవశాత్తూ వంతెన పైనుంచి నదిలోకి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నిన్న సాయంత్రం జరిగింది. మాన్వి వయసు 18 నెలలు. మేఘశ్యామ్ రెడ్డి కుటుంబం సెలవులకు గతనెల 15న ఎల్బీనగర్ లోని సహారా ఎస్టేట్కు వచ్చారు. వీరంతా ఈ నెల 26న లండన్కు తిరుగు ప్రయాణం కావలసిన ఉంది.