మావోయిస్టు పోస్టర్ల కలకలం

23 Dec, 2015 10:59 IST|Sakshi
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో మావోయిస్టు పోస్టర్లు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. బుధవారం ఉదయం గ్రామ ప్రధాన రహదారిపై బడ్డీ కొట్టుకు రెండు పోస్టర్లను అంటించి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పదేళ్ల క్రితం జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌కు గ్రామానికి చెందిన కుక్కమూతి శ్రీనుయే కారణమని అందులో ఆరోపించారు. మావోయిస్టుల పేరుతో నగదు వసూళ్లకు పాల్పడుతున్న అతడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అందులో హెచ్చరించారు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
 
మరిన్ని వార్తలు