పెళ్లి వాహనం బోల్తా....ఇద్దరి పరిస్థితి విషమం

8 Mar, 2015 08:36 IST|Sakshi

కర్నూలు: పెళ్లికి వెళ్లి వస్తున్న వాహనం బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి-గిరిగెట్ల రహదారిలోని మదనంతపురం స్టేజి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు...వేగంగా వస్తున్న పెళ్లి వాహనం ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న  13 మందికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని కర్నూలు, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
(తుగ్గలి)

మరిన్ని వార్తలు