గోరంట్ల: అనంతపురం జిల్లా గోరంట్లలో వివాహిత దారుణహత్యకు గురైంది. స్థానికంగా నివాసముంటున్న శంషాద్భానుపై గుర్తుతెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలనాకి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అత్తింటివారే తమ కూతురిని హత్యచేశారని ఆరోపిస్తున్నారు.