గన్నేరుపప్పు తిని ఆత్మహత్య

15 Sep, 2015 18:06 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్ (అనంతపురం) : కుటుంబ కలహాలతో ఓ వివాహిత గన్నేరుపప్పు తిని ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. పుట్టపర్తి మండలం నిజమామిడి గ్రామానికి చెందిన తులసి(35) మంగళవారం మధ్యాహ్నం గన్నేరు పప్పు తినగా, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సాయంత్రం మృతి చెందింది. తులసి భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో ఇంట్లో గొడవలు జరిగినట్టు తెలిసింది.

>
మరిన్ని వార్తలు