శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పూర్ణశాసనం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కర్తలి విజయశాంతి (27)కి వివాహం కాగా ఒక కుమారుడు, ఒక కమార్తె ఉన్నారు. భర్త సింగపూర్లో ఉంటుండడంతో విజయశాంతి పిల్లలతో కలసి పూర్ణశాసనం గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.