వివాహిత ఆత్మహత్య

15 Feb, 2016 14:14 IST|Sakshi

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పూర్ణశాసనం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కర్తలి విజయశాంతి (27)కి వివాహం కాగా ఒక కుమారుడు, ఒక కమార్తె ఉన్నారు. భర్త సింగపూర్‌లో ఉంటుండడంతో విజయశాంతి పిల్లలతో కలసి పూర్ణశాసనం గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

 

మరిన్ని వార్తలు