వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం బయనపల్లి గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రైల్వే కోడూరు పట్టణానికి చెందిన భూపాల ఉష (40) బయనపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియరాలేదు.