కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

19 Mar, 2015 21:37 IST|Sakshi

చిత్తూరు (పుంగనూరు): కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండల కేంద్రంలోని కోనేటి పాలెం వీధిలో గురువారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన గాయత్రి (26)కి, హరినాథ్ రెడ్డితో ఏడేళ్ల కిందట వివాహం అయింది. అప్పటినుంచి తరచు భర్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా హరి రెండో పెళ్లి చేసుకొవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన గాయత్రి బుధవారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు