మూగ యువతిపై సామూహిక లైంగికదాడి

9 Dec, 2014 01:31 IST|Sakshi
మూగ యువతిపై సామూహిక లైంగికదాడి

ముగ్గురు మృగాళ్లు కటకటాలపాలయ్యారు. మూగ యువతి అనే జాలి కూడా లేకుండా ఆ కామాంధులు లైంగికదాడికి పాల్పడ్డారు. నోరు లేదు కదా తమనేం చేస్తుందిలే అనుకున్నారేమో ... మూగ రోదనతోనే తన ఆవేదనను పోలీసులకు చెప్పి తగిన శాస్తి చేసింది. వారు మద్యం తాగడమే కాకుండా యువతి చేత బలవంతంగా మద్యం తాగించి అమానుషంగా అనుభవించారు.
 
పొదిలి : మూగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక తన కార్యాలయంలో సీఐ రవిచంద్ర ఆ వివరాలు వెల్లడించారు. మర్రిపూడి మండలం గంగపాలెం గ్రామంలో ఓ మూగ యువతి ఈ నెల 3వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉండగా, రాత్రి 12 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన సోమల ప్రసాద్‌రెడ్డి, బూన చినకాశిరెడ్డి, మన్నెం నరసింహ అలియాస్ రవిలు ఆమె ఇంట్లోకి చొరబడి సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు.

సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మర్రిపూడి పోలీసులు సోమవారం సాయంత్రం మర్రిపూడి మండలం గుండ్లసముద్రం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న మర్రిపూడి ఎస్సై బీవీవీ సుబ్బారావు, పీఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం, సిబ్బందిని సీఐ రవిచంద్ర అభినందించారు.

మరిన్ని వార్తలు