ముందే కనువిందు

13 Apr, 2018 09:07 IST|Sakshi
పాడేరు, డుంబ్రిగుడ మండలాల్లో విరబూసిన మే ఫ్లవర్స్‌ 

ఏప్రిల్‌లో విరబూసిన మే ఫ్లవర్స్‌

పాడేరు రూరల్, డుంబ్రిగుడ(అరకులోయ): ప్రతి ఏటా మే నెలలో కనిపించి కనువిందు చేసే మే ఫ్లవర్స్‌ ఈ ఏడాది  కాస్త ముందుగా ఏప్రిల్‌నెలలో విరబూశాయి. పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు వీధిలో తుడుముబాబూరావు అనే గిరిజనుడి ఇంటిపెరట్లో, డుంబ్రి గుడ మండలంలోని మారుమూల పంచాయతీ బొడ్డపుట్టు గ్రామంలో ఈ పుష్పాలు అందాలుచిందించాయి. బొడ్డపుట్టు గ్రామంలో ప్రధాన రోడ్డుకు అనుకుని ఉండడంతో ఆదారిన వెళ్లేవారు, గ్రామస్తులు  మే ఫ్లవర్‌ను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

మరిన్ని వార్తలు