మేయర్ దంపతులకు కన్నీటి వీడ్కోలు

20 Nov, 2015 02:18 IST|Sakshi

చిత్తూరు (అర్బన్): కష్ట సుఖాలను చివరి వరకూ పం చుకుంటామని అగ్ని సాక్షిగా చేసిన పెళ్లినాటి ప్రమాణాలు మేయర్ దంపతుల విషయంలో నిజమయ్యాయని పలువురు కన్నీటి నివాళులు అర్పించారు. దారుణ హత్యకు గురైన మేయర్ దంపతులకు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికేందుకు వందల సంఖ్యలో జనం గంగనపల్లెకు తరలివచ్చారు. గురువారం మధ్యాహ్నం గంగనపల్లెలోని మేయర్ నివాసం వెనుక ఉన్న ఫామ్‌హౌస్‌లో అధికారిక లాంఛనాలతో వారి భౌతికకాయాలకు అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు.

మోహన్ దంపతుల కుమారుడు కఠారి ప్రవీణ్ తల్లితండ్రులకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆ సమయంలో కఠారి కుమార్తెలు లావణ్య, హేమలత ఇక తమకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోదించడం చూపరులకు గుండె తడిచేసింది. ఇక అనురాధ తండ్రి, మోహన్ కుటుంబ సభ్యులు సైతం కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. మేయర్ దంపతుల భౌతికకాయాలను ఒకే గుంతలో ఖననం చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు