వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం

26 Oct, 2015 10:05 IST|Sakshi

కడప: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప రిమ్స్‌లో ఆదివారం రాత్రి ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కర్నూలు జిల్లాకు చెందిన సాయికృష్ణ రిమ్స్‌లో ఫస్టియర్ చదువుతున్నాడు.

దసరా సెలవుల అనంతరం ఆదివారం రాత్రి రిమ్స్ హాస్టల్‌కు చేరుకున్న అతడు తన గదిలో ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు సాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు