సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న పదిహేను బోధనాస్పత్రుల్లో వైద్యుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వారం రోజుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వైద్యవిద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టులను జోనల్ వ్యవస్థ ఆధారంగానే భర్తీ చేయాలని నిర్ణయించారు. పోస్టుల భర్తీకి ఎంపిక కమిటీని వేశారు. ఈ కమిటీకి కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చైర్మన్గానూ, వైద్య విద్య సంచాలకులు, ఆరోగ్యశాఖ సంచాలకులు, వైద్యవిధాన పరిషత్ కమిషనర్, వైద్య విద్య సంచాలకులు (అకడెమిక్) సభ్యులుగా ఉంటారు. మెరిట్ ఆధారంగానే భర్తీ ప్రక్రియ జరపాలని, ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించారు. సుమారు 650 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. 2010లో నియామకాలు జరిగినప్పుడు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం రాని వారికి మూడేళ్ల వయసు సడలింపునివ్వాలని కూడా నిర్ణయించారు.
మార్గదర్శకాలివే..