వైద్య విద్యార్థి ఆత్మహత్య

1 Feb, 2015 18:23 IST|Sakshi

విజయనగరం: ఒక ఎమ్‌బీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మహారాజా ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సెన్సైస్‌లో ఆదివారం జరిగింది. వివరాలు.. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన కోటిరెడ్డి(19) విజయనగరంలోని మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం కావడంతో బయటకు వెళ్దామని స్నేహితులు అడిగినా నిరాకరించాడు. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన స్నేహితులు చూడగా ఫ్యాన్‌కు ఊరి వేసుకొని కనిపించాడు. కొన ఊపిరితో ఉన్నాడేమోనన్న అనుమానంతో ఆస్పత్రికి తరలించగా వైద్యలు మృతి చెందినట్లు ప్రకటించారు. కాగా, కోటిరెడ్డికి తన మరదలు చైతన్య దీప్తితో గత ఏడాది నిశ్చితార్థం జరిగిందని, ఆమె ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మనస్థాపం చెందాడని స్నేహితులు తెలిపారు. ఆ ఆవేదనతోనే అతను ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(నెల్లిమర్ల)

మరిన్ని వార్తలు