హైదరాబాద్ : సమన్యాయం చేయాలంటూ గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాయంగా ఉండేందుకు తల్లి విజయమ్మ, భార్య భారతికి అనుమతి ఇవ్వాలంటూ జగన్ తరపు న్యాయవాది శుక్రవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. కాగా ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న జగన్ ను చూసేందుకు కుటుంబ సభ్యులను కూడా అనుమతించటం లేదు.
మరోవైపు జగన్ దీక్ష, రాజకీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం లోటస్ పాండ్లో సమావేశమైంది. తాజా రాజకీయ వ్యవహారాలను కమిటీ పరిశీలించింది.