రాజన్న సంతకం: చెరగని జ్ఞాపకం

29 Aug, 2019 09:57 IST|Sakshi

రాజశేఖర రెడ్డి. ఆ పేరు, ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రతి మదిలో పదిలంగా ఉన్నాయి. రాజన్న పాలన.. ఆయన అందించిన సంక్షేమ పథకాలు..  వాటి ద్వారా లబ్ధిపొందిన లక్షలాది మంది ప్రజలు. రాజన్నను ఇప్పటికే తెలుగు ప్రజలూ ప్రతినిత్యం తలుచుకుంటూనే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పదో వర్ధంతి (సెప్టెంబర్ 2 వ తేదీ) సందర్భంగా రాజన్న పాలన, ఆయనతో మీకు ఎదురైన జ్ఞాపకాలను మాతో పంచుకోండి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్‌.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు.. మరెంతో మంది లబ్ధిదారులు. రాజన్న వర్ధంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను, ఆ విషయాలను మాతో పంచుకోండి. వాటిని www.sakshi.com వెబ్ సైట్ లో ప్రచురిస్తాం.  మీ అనుభవాలను, జ్ఞాపకాలను ఒక్క పేరాకు మించకుండా రాసి దానితో పాటు మీ పేరు, ఊరు, ఫోన్ నంబర్ వంటి వివరాలతో info@sakshi.com కు మెయిల్ ద్వారా మాకు పంపించండి. 

మరిన్ని వార్తలు