హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లకు లేఖ రాశారు. తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనేదే తమ డిమాండ్ అని తెలిపారు.
మజ్లిస్ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగినట్లయితే, భవిష్యత్తులో సంఘ్ పరివార్ పుంజుకుంటుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా మతతత్వ శక్తుల ప్రభావం పెరిగి అభివృద్ధికి ఆటంకం ఏర్పడే ప్రమాదముందని అసదుద్దీన్ హెచ్చరించారు.