మేనిఫెస్టోలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాం : మంత్రి

10 Dec, 2019 19:13 IST|Sakshi

రాజకీయాల కోసం భాషను వాడుకోకండి : ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: పేద పిల్లలకు బంగారు భవిష్యత్‌ అందిచడానికే ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఇంగ్లీష్‌ మీడియం అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్ష పార్టీల నాయకులకు హితవు పలికారు. నేటి ఆధునిక సమాజంలో ఇంగ్లీష్‌ మీడియం చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తెలుగు భాషా వికాసానికి కట్టుబడి ఉందని, మేనిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, స్కూళ్లలో మౌలిక సుదపాయాలు కల్పిస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు