చంద్రబాబు హయాంలో అన్ని కుంభకోణాలే..

16 Jul, 2020 11:50 IST|Sakshi

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఒక్క గజం కూడా దోపిడీకి గురికాలేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ భూకబ్జా జరగకుండా రూ.400 కోట్ల విలువైన భూములను కాపాడామని పేర్కొన్నారు. ‘‘టీడీపీ నేతలు ఐదేళ్లలో భూకబ్జాలు, దోపిడీలకు పాల్పడ్డారు. విశాఖ పరిపాలన రాజధాని కాకుండా చంద్రబాబు ఎన్ని కుట్రల చేసినా ఆగదని’’ మంత్రి అవంతి స్పష్టం చేశారు.

బీచ్‌రోడ్డు‌లో ట్రామ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని అవంతి పేర్కొన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు రాబోతుందని, మెట్రో రైలుతో విశాఖ రూపురేఖలు మారనున్నాయని ఆయన వెల్లడించారు. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్ దెబ్బతీసే విధంగా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అన్ని కుంభకోణాలేనని, తమది అవినీతి రహిత పాలన అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు