ఇనాం భూ సమస్య పరిష్కరిస్తా:మంత్రి అవంతి 

29 Sep, 2019 15:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: యారాడ సముద్ర తీరంలో రూ.2 కోట్ల వ్యయంతో  ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం యారాడ గ్రామంలో జీవీఎంసీ నిర్మించిన రెండు కమ్యూనిటీ భవనాలను మంత్రి అవంతి,ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ ఇనాం భూ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.యారాడని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు