ఎంతటి వారైనా శిక్షపడేలా చూస్తాం

23 Jun, 2019 11:37 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : ఆరుగురు మృగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలికను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆదివారం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన ఆయన  బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులు మానవత్వం లేకుండా వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు. దీనిపై హోంశాఖతో కూడా మాట్లాడానని, నిందితులు ఎంతటివారైనా కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. కాగా ఈ అత్యాచార ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి సుచరిత విచారణ జరిపారు. విచారణ వేగవంతంగా చేపట్టాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు