కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి బొత్స సమీక్ష

20 Apr, 2020 18:48 IST|Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు, వ్యవసాయ పనులకు ఇచ్చిన మినహాయింపులపై సోమవారం అధికారులతో ఆయన చర్చించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంపై ఆరా తీశారు. అరటి, మామిడి పంటల ఎగుమతికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ డా ఎం.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ జి.సి కిషోర్ కుమార్‌లతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు