విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా తీర్చిదిద్దుతాం: గంటా

17 Nov, 2014 10:00 IST|Sakshi

విశాఖ : విశాఖను 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా తీర్చిదిద్దుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన సోమవారం ఉదయం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ పునరుద్ధరణ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉడా పార్క్ వద్ద మారథాన్ రన్ను మంత్రి గంటా ప్రారంభించారు.  టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయిస్తోందని ఆయన తెలిపారు. విశాఖను ప్రపంచ స్థాయి పర్యాటక నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

 

>
మరిన్ని వార్తలు