బిల్లులను అడ్డుకోవడం దారుణం

18 Jun, 2020 20:37 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, అమరావతి: టీడీపీ రాష్ట్రం కోసం కాకుండా అమరావతి కోసం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ శాసనమండలిలో టీడీపీ తీరును దుయ్యబట్టారు. బిల్లులను అడ్డుకోవడం టీడీపీ గొప్పగా భావిస్తుందని మండిపడ్డారు.ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలు ఎందుకు తీశారు అని ప్రశ్నిస్తే దాడి చేస్తారా అంటూ ఆయన నిప్పులు చెరిగారు. టీడీపీ సభ్యులను డిప్యూటీ చైర్మన్‌ మా వాళ్లు  అంటూ సంబోధించారని కన్నబాబు మండిపడ్డారు.  (‘బాబులిద్దరికి అధికార దర్పం దిగలేదు’)

అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేస్తే టీడీపీ నేతలు అన్నా హజారేని అరెస్ట్‌ చేసినంత గోల చేశారని ఎద్దేవా చేశారు. గతంలో ముద్రగడ అరెస్ట్‌ గుర్తు లేదా అని ప్రశ్నించారు. దాడి చేసిన టీడీపీ నేతల్ని చంద్రబాబు అభినందించారని, గతంలో కూడా బాగా రౌడీయిజం చేశారని ఆయన మెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, మొదటి నుంచి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కన్నబాబు నిప్పులు చెరిగారు.

>
మరిన్ని వార్తలు