ప్రత్యేక విమానంలో పంపిస్తాం: నారాయణ

9 Jun, 2014 13:12 IST|Sakshi
ప్రత్యేక విమానంలో పంపిస్తాం: నారాయణ

హైదరాబాద్: హిమాచల్‌ ప్రదేశ్‌ బియాస్ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటనాస్థలికి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేక విమానంలో తరలించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఈ ప్రత్యేక విమానాన్ని చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ముందుగా చండీగఢ్‌కు పంపిస్తామని, అక్కడి నుంచి ఘటనాస్థలానికి ప్రత్యేక బస్సుల్లో వెళతారని వివరించారు.

మరోవైపు 15 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎయిర్‌ఇండియా విమానంలో హైదరాబాద్ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ కు బయల్దేరారు.

మరిన్ని వార్తలు