'ప్రధానిని విమర్శించే అర్హత మోడీకి లేదు'

16 Aug, 2013 15:18 IST|Sakshi

హైదరాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై మంత్రి సి రామచంద్రయ్య విరుచుకు పడ్డారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని విమర్శించే అర్హత మోడికి లేదన్నారు.గుజరాత్‌ అనేక రంగాల్లో అభివృధ్ధిలో విఫలమైందని రామచంద్రయ్య విమర్శించారు. ప్రధానిపై మోడీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

తక్షణమే మోడీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా రాయలసీమ విభజనకు తాము ఒప్పుకొనేది లేదని రామచంద్రయ్య స్పష్టం చేశారు. 19న జరిగే ఆంటోనీ కమిటీలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతామని ఆయన తెలిపారు. ఆంటోనీ కమిటీకి తమ వాదనలు వినిపిస్తామని రామచంద్రయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు