భవానీ ద్వీపాన్ని సందర్శించిన మంత్రులు

23 Jun, 2019 20:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో నెలవైన భవానీ ద్వీపాన్ని మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భవానీ ద్వీపం అభివృద్ధితోపాటు పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు. పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయమై అధికారులతో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతోపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు