రైతు నేతలతో ఏపీ మంత్రుల రహస్య చర్చలు

30 Jan, 2016 18:33 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంలో ఏపీ మంత్రులు పర్యటిస్తున్నారు. రైతు నేతలతో రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ రహస్య చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో రైతుల సమస్యలన్నీ వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినట్టు సమాచారం. జేసీ శ్రీధర్్ను సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా నియమిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాక ఆందోళనలు చేయెద్దని రైతు నేతలకు వారు హితవు పలికినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు