శ్రీకాకుళం : శ్రీకాకుళంలో ఆదివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానిక కృష్ణా పార్క్ ప్రాంతంలో 4 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియని ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు.