కైలాసగిరిపై స్వల్ప అగ్నిప్రమాదం

21 Apr, 2015 17:37 IST|Sakshi

విశాఖపట్నం : విశాఖ నగరం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై మంగళవారం మధ్యాహ్నం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు చెత్తాచెదారం అంటుకోవటంతో ఆ మంటలు ఎండిన చెట్లకు వ్యాపించాయి.

వేడిగాలులు తోడు కావటంతో మంటల తీవ్రత పెరుగుతుందేమోనని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కాగా అధికారులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోగా పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు