తప్పిపోయిన మహిళల ఆచూకీ లభ్యం

5 Jan, 2015 09:01 IST|Sakshi

కర్నూలు: శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళల ఆచూకీ లభించింది. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మహిళలు డిసెంబర్ నెలలో శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళల ఆచూకీ లభించినట్లుతెలిసింది.

 

చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళకు సంబంధించిన వివరాలు డిసెంబర్ 29 వ తేదీ నుంచి తెలియకపోవడంతో బంధువులు ఆందోన చెందారు. కనీసం ఆ మహిళ సెల్ ఫోన్లు పూర్తిగా స్తంభించిపోవడంతో  బంధువుల ఆదోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ మహిళల ఆచూకీ లభించడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు