శ్రీవారి సేవలో సిరిసేన దంపతులు

18 Feb, 2015 19:14 IST|Sakshi
శ్రీవారి సేవలో సిరిసేన దంపతులు

తిరుమల: శ్రీ లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన భార్య కుమారితో కలసి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని బుధవారం వేకువజామున సుప్రభాత సేవా సమయంలో దర్శించుకున్నారు. వీరి వెంట శ్రీ లంక కేబినెట్ మంత్రులు పలువురు కూడా ఉన్నారు. వీరికి వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు ఆహ్వానం పలికారు. దర్శనానంతరం స్వామి ప్రసాదాలను అందజేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు