లంచం లేనిదే పని కావడం లేదు

19 Jun, 2018 16:41 IST|Sakshi
ఎమ్మెల్యే అంజద్‌ బాషా(ఫైల్‌ ఫొటో)

సాక్షి, వైఎస్సార్‌ కడప :  నగర పాలక సంస్థ అధికారులపై కడప ఎమ్మెల్యే అంజద్‌ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం లేనిదే ఏ పని కావడం లేదని మండిపడ్డారు. ప్రతి పేద వాడి దగ్గర నుంచి చిన్న చిన్న పనులకు కూడా డబ్బులు డిమాండ్‌ చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. అధికార టీడీపీ మహిళా కార్పొరేటర్ల భర్తలు చెప్పినట్టు అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.

అందరికి ఒకేలా పని చేయాలని.. ఇలా వ్యవహరించటం తప్పని.. హితవు పలికారు. అధికారుల తీరు మారకుంటే చూస్తు ఊరుకునేది లేదని బాషా హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు