గ్రామ వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలి

5 Aug, 2019 15:38 IST|Sakshi
పామర్రు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ 

సాక్షి, కృష్ణా జిల్లాః నవరత్నాల పథకాలు ప్రజలందరికీ చేరాలంటే వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని పామర్రు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలాకులు జడ్పీ హైస్కూల్లో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి కుటుంబానికి గ్రామ వాలంటీర్లు చేయూత నివ్వాలని కోరారు.
 

మరిన్ని వార్తలు