‘ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’

21 Sep, 2019 14:41 IST|Sakshi

సాక్షి, గుంటూరు :  టీడీపీ నేతల అరాచకాలపై నరసరావుపేట ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తిపోట్లకు గురైన వెంకటరెడ్డిని శనివారం ఎమ్మెల్యే పరామర్శించారు. చంద్రబాబు పునరావాస కేంద్రంలోని వ్యక్తే కత్తితో దాడి చేశాడని విమర్శించారు. ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలే దాడులు చేస్తూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు