సత్యదేవుని దర్శించిన రోజా దంపతులు

26 Feb, 2016 01:02 IST|Sakshi

అన్నవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, సెల్వమణి దంపతులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వారికి పండితులు వేదాశీస్సులు అందజేశారు. స్వామివారి ప్రసాదాలను ఆలయ ఏసీ ఈరంకి జగన్నాథరావు అందించారు. రోజాను ఈఓ కె.నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. రోజాను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు కొండపల్లి అప్పారావు, రాయి శ్రీను, బీఎస్‌వీ ప్రసాద్, బత్తుల రవికుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు.
 

మరిన్ని వార్తలు