108 వాహ‌నాన్ని స్వ‌యంగా న‌డిపిన ఎమ్మెల్యే రోజా

7 Jul, 2020 14:32 IST|Sakshi

సాక్షి, తిరుప‌తి : న‌గ‌రి  పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్ర‌హం వ‌ద్ద 108,104 అంబులెన్సు వాహ‌నాల‌ను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. దీనిలో భాగంగా 108 వాహ‌నాన్ని రోజా  స్వ‌యంగా న‌డిపారు. ఈ కార్య‌క్ర‌మానికి వైఎస్సార్‌సీపీ కార్య‌కర్త‌లు, అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.  రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర సేవ‌లందించే 108,104 వాహ‌నాల‌ను అత్యాధునిక సౌక‌ర్యాల‌తో జూలై 1న 1008 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఒకేసారి ప్రారంభించిన సంగ‌తి తెలి‌సిందే. 


 

మరిన్ని వార్తలు