వండర్స్ సృష్టించిన ఏకైక సీఎం జగన్ : రోజా

23 May, 2020 18:15 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : వన్ ఇయర్‌లో వండర్స్ సృష్టించిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అని ఏపీఐఐసీ ఛైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను వైఎస్ జగన్ కళ్లారా చూసి, అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలను అమలు చేశారని కొనియాడారు. 

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పాలనలో అన్నివర్గాలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 43 వేల బెల్టు షాపులు పెట్టిన ఘనత చంద్రబాబుదని ధ్వజమెత్తారు. మొదటి సంతకంతోనే బెల్టు షాపులను తొలగించిన ఘనత సీఎం జగన్‌ది అని రోజా అన్నారు.

మరిన్ని వార్తలు