కర్నూలు, ప్రకాశంలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

3 Jul, 2015 18:30 IST|Sakshi
కర్నూలు, ప్రకాశంలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

కర్నూలు/ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల తర్వాత ముగిసింది. కర్నూలు జిల్లాలో భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ అత్యధికంగా 1087 ఓట్లకు గాను 1080 ఓట్లు పోలవడంతో 99.67 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లాలో 76 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 992 ఓట్లకు గాను 755 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు