‘కాంగ్రెస్‌ బలపడితే బీజేపీదే బాధ్యత’

4 Jun, 2017 14:08 IST|Sakshi
‘కాంగ్రెస్‌ బలపడితే బీజేపీదే బాధ్యత’

గుంటూరు: ప్రత్యేక హోదా అనేది ఫుల్‌ప్టాప్‌ పెట్టే అంశం కాదని, అది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష అని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజల కోరికను ప్రధాని నరేంద్ర మోదీ మన్నించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలపడితే బీజేపీ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

రాజకీయ ప్రయోజనమే రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. కట్టుబట్టలతో బయటకు పంపి ఇవాళ రాష్ట్ర పర్యటనకు వస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేకహోదా భరోసా సభను ప్రజలు బహిష్కరించాలని కోరారు.

>
మరిన్ని వార్తలు