తెలంగాణలో మరిన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రులు: దత్తాత్రేయ

6 Feb, 2015 07:01 IST|Sakshi
తెలంగాణలో మరిన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రులు: దత్తాత్రేయ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరిన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రులను ఏర్పా టు చేయనున్నట్టు కేంద్రమంత్రి దత్తాత్రేయ తెలిపారు. నిర్మల్‌లో ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించారు. బీడీ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న ట్టు చెప్పారు. గురువారం ఆయనను దిల్‌కుశ అతిథి గృహంలో గృహనిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో పేదలకు అధి కంగా గృహాలు నిర్మించేందుకు, గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.900 కోట్లు కేటాయించేలా  సహకరించాలని కోరారు. ఈ ఉత్సవాలకు  రాష్ట్రపతి, ప్రధాని వచ్చేలా చూడాలని కోరారు.
 

>
మరిన్ని వార్తలు