సాక్షి, కృష్ణా : విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. టిక్టాక్ ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. తరచూ టిక్ టాక్ చేయవద్దని భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలోనే తల్లి మృతిని జీర్ణించుకోలేక పోయిన కుమారుడు కూడా సైనెడ్ తాగి తనువుచాలించాడు. నిమిషాల వ్యవధిలోనే తల్లి ,కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా లాక్డౌక్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో చాలామంది స్త్రీ, పురుషు తేడా లేకుండా టిక్టాక్తో కాలక్షేపం చేస్తున్నారు. దీని కారణంగా చాలా కుటుంబాల్లో గొడవులు సైతం చోటుకుని ప్రాణాలను తీసుకుంటున్నారు. (టిక్టాక్ను పూర్తిగా నిషేధించాలి: ఎన్సీడబ్ల్యూ)