తల్లీకొడుకు ఆత్మహత్య: మరో కొడుకు పరిస్థితి విషమం

1 Dec, 2013 15:52 IST|Sakshi

మహబూబ్‌నగర్: దామరగిద్ద మండలం వత్తుగుల్లలో ఓ తల్లి తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటనలో తల్లి, ఒక కొడుకు మృతి చెందారు. మరో కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.

ఇద్దరు కుమారులు సహా తల్లి గోవిందమ్మ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసి స్థానికులు వారిని నారాయణపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకొడుకు మృతి చెందారు. మరో కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ కొడుకు కూడా చావుబతులకు మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు