చెక్‌డ్యాంలో పడి తల్లి,కూతురు మృతి

29 Mar, 2016 18:27 IST|Sakshi

ఓడీచెరువు (అనంతపురం జిల్లా) : ఓడీచెరువు మండలం మహ్మదాబాద్ క్రాస్ వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తూ చెక్‌డ్యాంలో పడిపోయి లక్ష్మీనరసమ్మ(40), భారతీ(20) అనే ఇద్దరు తల్లీకూతుళ్లు మృతిచెందారు. స్థానికులు గమనించి వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు