ఐదు రోజుల పసికందును చంపిన తల్లి

16 Nov, 2013 19:01 IST|Sakshi

సికింద్రాబాద్లోని చిలకలగూడలో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఎయిడ్స్ సోకిందనే అనుమానంతో ఐదు రోజుల పసికందును కన్న తల్లి గొంతు నులిమి చంపింది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి ఆ పసి పాపను ఆసుప్రతికి తరలించారు. అయితే ఆ పాప అప్పటికే మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దాంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ పసి కందు కన్న తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు