బడికెళ్లలేదని కూతురికి వాతలు

27 Sep, 2019 09:17 IST|Sakshi
చిన్నారికి వాతలు పెట్టిన దృశ్యం

ఓ తల్లి దురాగతం

సాక్షి, అవుకు (కర్నూలు): పాఠశాలకు వెళ్లలేదనే కోపంతో కూతురికి కన్న తల్లే వాతలు పెట్టిన ఘటన మండల కేంద్రంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మెట్టుపల్లె గ్రామానికి చెందిన ప్రశాంతికి కర్నూల్‌కు చెందిన ప్రసాద్‌కు 2007లో వివాహమైంది. వీరికి కూతురు బిందుభార్గవి ఉంది. 2017లో ప్రసాద్‌ అనారోగ్యంతో మృతిచెందడంతో ప్రశాంతి కూలిపనులు చేసుకుంటూ మండల కేంద్రంలోని కుమ్మరిదిడ్డి వీధిలో కూతురితో కలిసి నివాసం ఉంటోంది. చిన్నారి బిందుభార్గవి స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం చిన్నారి స్కూల్‌కు వెళ్లకపోవడంతో ఆగ్రహించిన తల్లి ప్రశాంతి కూతురి చెతులపై వాతలు పెట్టింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న చిన్నారి నాయనమ్మ లక్ష్మిదేవి గురువారం మండల కేంద్రానికి చేరుకొని బిందుభార్గవిని తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు