విషం తాగి తల్లి, కొడుకు ఆత్మహత్య

7 Dec, 2015 20:25 IST|Sakshi

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ తన కుమారుడికి విషం తాగించి, తానూ తాగి తనువు చాలించింది. ఈ విషాదం కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాగన్నచెరువు గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన పితాని దానమ్మ(23), ఆమె కుమారుడు సాయి(4) సోమవారం సాయంత్రం సమీపంలోని చెరువు వద్ద విగత జీవులై పడి ఉండగా స్థానికులు గుర్తించారు. వారి సమీపంలో పురుగు మందు డబ్బా పడి ఉంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో వారు చనిపోయారని భావిస్తున్నారు.



 

మరిన్ని వార్తలు