‘పొరుగు రాష్ట్రంలో కూర్చుని రాళ్లు విసరడం కాదు’

6 Apr, 2020 13:02 IST|Sakshi

సాక్షి, అమరావతి : పొరుగు రాష్ట్రంలో కూర్చుని రాళ్లు విసరడం కాదు, కరోనా నుంచి కోలుకుని ఆసుత్రులనుంచి డిశ్చార్జ్‌ అయిన వారితో మాట్లాడితే బాగుంటుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ట్వటర్‌లో సూచించారు. చికిత్స ఎలా జరిగింది, వసతులెలా ఉన్నాయి, డాక్టర్లు ఎంత శ్రధ్ద తీసుకున్నది తెలుస్తుందని పేర్కొన్నారు. కోడి గుడ్డుపై ఈకలు పీకడమేనా? కాలంతో పాటు మారక పోతే ఎలా బాబూ? అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
 

>
మరిన్ని వార్తలు